సిల్హెట్: మహిళల ఆసియాకప్లో ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత జట్టు.. స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఫైనల్కు దూసుకెళ్లింది. టోర్నీ మొత్తంలో ఒకే ఒక్క మ్యాచ్లో ఓడిన టీమ్ఇండియా.. గురువారం సెమీస్లో 74 పరుగుల తేడాతో థాయ్లాండ్ను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ (42), కెప్టెన్ హర్మన్ప్రీత్ (36), జెమీమా(27) రాణించారు. గత కొన్ని మ్యాచ్లుగా జట్టుకు దూరంగా ఉన్న హర్మన్ రీఎం ట్రీలో అదరగొట్టింది.
అనంతరం లక్ష్యఛేదనలో థాయ్లాండ్ 20 ఓవర్లో 9 వికెట్లు కోల్పోయి 74 పరుగులకు పరిమితమైంది. నటాయా (21) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో దీప్తి 4 ఓవర్లలో కేవలం 7 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. రాజేశ్వరి గైక్వాడ్ రెండు వికెట్లు ఖాతాలో వేసుకుంది. షఫాలీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. హోరాహోరీగా సాగిన మరో సెమీఫైనల్లో పాకిస్థాన్పై పరుగు తేడాతో శ్రీలంక విజయం సాధించింది. శనివారం జరుగనున్న తుదిపోరులో లంకతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.
8 ఆసియా కప్లో భారత మహిళల జట్టు ఫైనల్కు చేరడం ఇది వరుసగా ఎనిమిదోసారి.