దుబాయ్: అండర్-19 ఆసియాకప్లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన పోరులో భారత జట్టు పరాజయం పాలైంది. తొలి పోరులో అఫ్గానిస్థాన్పై ఘనవిజయం సాదించిన యువ భారత్ ఆదివారం 8 వికెట్ల తేడాతో పాక్ చేతిలో ఓడింది. మొదట భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 259 పరుగులు చేసింది.
కెప్టెన్ ఉదయ్ (60), ఆదర్శ్ (62), సచిన్ దాస్ (58) హాఫ్సెంచరీలు నమోదు చేసుకున్నారు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్థాన్ 47 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. అజాన్ (105 నాటౌట్) సెంచరీతో కదంతొక్కగా.. షాహజాబ్ ఖాన్ (63), సాద్ (68) అర్ధశతకాలు సాధించారు.