షెన్జెన్: చైనా మాస్టర్స్లో భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్-చిరాగ్ సెమీస్కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్లో 21-13, 16-21, 21-18తో కిమ్ అస్ట్రప్-ఆండర్స్ రస్ముసెన్ (డెన్మార్క్)పై గెలిచింది. పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ పోరాటం క్వార్టర్స్లోనే ముగిసింది.
తను 16-21, 16-21తో హాంకాంగ్కు చెందిన లీ చియాక్ చేతిలో ఓడాడు. దాంతో టోర్నీలో భారత్ నుంచి సాత్విక్ జోడీనే మిగిలింది.