దుబాయ్: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్స్కు అంపైర్లను ఐసీసీ ఖరారు చేసింది. నవంబర్ 10న ఇండియా-ఇంగ్లండ్ తలపడే రెండో సెమీఫైనల్కు శ్రీలంకకు చెందిన కుమార ధర్మసేన, ఆస్ట్రేలియాకు చెందిన పాల్ రీఫెల్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. క్రిస్ గఫానీ థర్డ్ అంపైర్గా, రాడ్ టక్కర్ నాలుగో అంపైర్గా, డేవిడ్ బూన్ మ్యాచ్ రెఫరీగా వ్యవహరిస్తారు. 9న న్యూజిలాండ్-పాకిస్థాన్ మధ్య తొలి సెమీఫైనల్కు మారస్ ఎరాస్మస్, రిచర్డ్ ఇల్లింగ్వర్త్ ఫీల్డ్ అంపైర్లుగా, రిచర్డ్ కెటిల్బరో థర్డ్ అంపైర్గా, మైకేల్ గాఫ్ నాలుగో అంపైర్గా, క్రిస్ బ్రాడ్ మ్యాచ్ రెఫరీగా నియమితులయ్యారు. సెమీస్ ఫలితాలు వెలువడిన తర్వాత ఫైనల్ మ్యాచ్కు అంపైర్లను నిర్ణయిస్తారు.