జైపూర్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టు వరుసగా మూడో పరాజయం మూటగట్టుకుంది. శుక్రవారం మహారాష్ట్రతో జరిగిన పోరులో హైదరాబాద్ 3 వికెట్ల తేడాతో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది.
ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (103; 9 ఫోర్లు, ఒక సిక్సర్) శతకంతో కదం తొక్కగా.. కెప్టెన్ రాహుల్ సింగ్ (69), రాహుల్ బుద్ధి (58 నాటౌట్), రవితేజ (33 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్సెంచరీలతో సత్తాచాటారు. అనంతరం లక్ష్యఛేదనలో మహారాష్ట్ర 49.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 316 పరుగులు చేసింది. అంకిత్ (113), అజీమ్ కాజీ (8) రాణించారు. మన బౌలర్లలో కార్తికేయ 5 వికెట్లు పడగొట్టినా ఫలితం లేకపోయింది.