హనుమకొండ చౌరస్తా: జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో హనుమకొండ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. అండర్-14, 16, 18, 20 విభాగాల్లో బాలికలు, బాలురు, పురుషులు, మహిళలు వివిధ క్రీడాంశాల్లో తమ ప్రతిభ చాటుతున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 891 మంది అథ్లెట్లు టోర్నీలో పోటీపడుతున్నారు. తొలి రోజైన సోమవారం పరుగు పందెంతో పాటు జావెలిన్ త్రో విభాగాల్లో అథ్లెట్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు.
సింథటిక్ ట్రాక్పై చిరుతలను తలపిస్తూ పరుగుపెట్టారు. అంతకుముందు టోర్నీని కుడా చైర్మన్ సుందర్రాజ్యాదవ్, రిటైర్డ్ ఎస్పీ నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. తర్వాత జరిగిన మీడియా సమావేశంలో సుందర్రాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యమిస్తున్నారు అన్నారు. దేశంలో ప్రతి పల్లెల్లో క్రీడా ప్రాంగణాలు కల్గిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. అక్టోబర్లో సౌత్జోన్ చాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, వరద రాజేశ్వర్రావు, వెంకటేశ్వర్రెడ్డి, చంద్రమౌళిగౌడ్ పాల్గొన్నారు.