కేప్టౌన్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేళైంది. కోట్లాది మంధి భారతీయుల ఆశలపై నీళ్లు చల్లుతూ వరుసగా ఏడోసారి తుదిపోరుకు అర్హత సాధించిన ఆస్ట్రేలియా.. ఆతిథ్య దక్షిణాఫ్రికాతో ఆదివారం అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో ఆస్ట్రేలియా ఐదుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలువగా.. దక్షిణాఫ్రికా మొదటి సారి మెగాటోర్నీ ఫైనల్కు చేరింది.
బలాబలాల పరంగా చూసుకుంటే ఆస్ట్రేలియాదే పైచేయిలా కనిపిస్తున్నా.. సెమీఫైనల్లో పటిష్ట ఇంగ్లండ్ను మట్టికరిపించిన దక్షిణాఫ్రికాను తక్కువ అంచనా వేయడానికి లేదు. అందులోనూ సొంతగడ్డపై మ్యాచ్ జరుగనుండటం సఫారీలకు అదనపు బలం కానుంది. లానింగ్, హీలీ, గార్డ్నర్, మూనీ, పెర్రీ, తహిలా, షుట్తో ఆస్ట్రేలియా శత్రుదుర్బేధ్యంగా కనిపిస్తుండగా.. సునె లుస్, మారినే కాప్, షబ్నమ్, వాల్వర్ట్పై దక్షిణాఫ్రికా ఆశలు పెట్టుకుంది.