లండన్: ఇంగ్లండ్తో యాషెస్ ఐదో టెస్టులో ఆస్ట్రేలియా దీటుగా బదులిస్తున్నది. 384 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ వర్షం కారణంగా ఆదివరాం నాలుగో రోజు ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టపోకుండా 135 పరుగులు చేసింది.
ఓపెనర్లు వార్నర్ (58 బ్యాటింగ్), ఖవాజా (69 బ్యాటింగ్) అర్ధశతకాలతో రాణించారు.