లండన్: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. తన అద్భుత ఆటతీరుతో ఇప్పటికే లెక్కకు మిక్కిలి రికార్డులు సొంతం చేసుకున్న కింగ్ కోహ్లీ మరో అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. గతేడాది మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో దాయాది పాకిస్థాన్తో జరిగిన టీ20 ప్రపంచకప్ పోరులో కోహ్లీ విశ్వరూపం ప్రదర్శించాడు.
విజయానికి 8 బంతుల్లో 28 పరుగులు అవసరమైన స్థితిలో పాక్ పేసర్ హరిస్ రవూఫ్ను లక్ష్యంగా చేసుకుంటూ కోహ్లీ కొట్టిన కండ్లు చెదిరే సిక్స్ను ఐసీసీ షాట్ ఆఫ్ ద సెంచరీగా ప్రకటించింది. విరాట్ పుట్టిన రోజు సందర్భంగా ఐసీసీ తమ అధికారిక ఇన్స్టాగ్రామ్లో వీడియోను పోస్ట్ చేసింది. ఈ శతాబ్దపు అత్యుత్తమ షాట్ అంటూ ఐసీసీ కొనియాడింది. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో పాక్పై భారత్ విజయదుందుభి మోగించిన సంగతి తెలిసిందే.