షెన్జెన్: మంగళవారం నుంచి ఆరంభం కానున్న చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు తమ ర్యాంకింగ్ పాయింట్లను పెంచుకునేందుకు, తద్వారా ఒలింపిక్స్కు అర్హత సాధించేందుకు బరిలోకి దిగనున్నారు.
పురుషుల విభాగంలో హెచ్ఎస్ ప్రణయ్ తైవాన్కు చెందిన చౌ తీన్ చెన్ను, లక్ష్య సేన్ చైనాకు చెందిన షి యుకితో, కిడాంబి శ్రీకాంత్ థాయిలాండ్కు చెందిన కున్లావత్ విదిత్శరన్తో, ప్రియాంశు రజవత్ జపాన్కు చెందిన కెంటా నిషిమొటొతో తొలి రౌండ్లో తలపడనున్నారు.