న్యూఢిల్లీ: ఆసియా కప్ నిర్వహణపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) మధ్యేమార్గాన్ని అనుసరిస్తూ గురువారం టోర్నీ షెడ్యూల్ను ప్రకటించింది.
హైబ్రిడ్ మోడల్ తరహాలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు పాకిస్థాన్లో నాలుగు, శ్రీలంకలో తొమ్మిది మ్యాచ్లు నిర్వహించనున్నారు.