చెన్నై : ఆగస్టు 3 నుంచి 12 వరకు చెన్నైలో ఆసియన్ చాంపియన్స్ ట్రోఫి హాకీ టోర్నీ నిర్వహించనున్నారు. 16 ఏళ్ల తరువాత చెన్నై అంతర్జాతీయ టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నది. సెప్టెంబరులో చైనాలోని హోంగ్జౌలో జరుగనున్న ఆసియన్ క్రీడలకు ఈ పోటీలు సన్నాహకంగా ఉపయోగపడనున్నాయి. చైనా, పాకిస్థాన్ జట్లు పోటీలలో పాల్గొనేది ఇంకా ధృవీకరించలేదు. ఆతిథ్య ఇండియాతోపాటు దక్షిణ కొరియా, మలేసియా, జపాన్, చైనా, పాకిస్థాన్ టైటిల్కోసం తలపడనున్నాయి. ఈ టోర్నీని భారత జట్టు మూడుసార్లు (2011, 2016, 2018లో పాకిస్థాన్తో సంయుక్తంగా) గెలుచుకున్నది.