కటక్: అల్టిమేట్ ఖోఖో లీగ్లో తెలుగు యోధాస్(18) సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పోరులో యోధాస్ 38-30తేడాతో చెన్నై క్విక్గన్స్పై అద్భుత విజయం సాధించింది. మ్యాచ్లో ఆది నుంచే యోధాస్ తమదైన ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఈ సీజన్లో సెమీస్ బెర్తు దక్కించుకున్న తొలి జట్టుగా నిలిచింది.
యోధాస్ తరఫున రాహుల్ మండల్ అటాకింగ్లో 10 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. చెన్నై ప్లేయర్లను వరుస విరామాల్లో ఔట్ చేసిన యోధాస్ 24-0తో స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది.