హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పీహెచ్ఎల్)లో తెలుగు టాలన్స్ జట్టు సెమీఫైనల్కు దూసుకెళ్లింది. గ్రూప్ దశలో ఆడిన 8 మ్యాచ్ల్లో ఆరింట నెగ్గిన తెలుగు టాలన్స్.. మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది.
జైపూర్లో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో తెలుగు టాలన్స్ 26-25తో గోల్డెన్ ఈగల్స్ ఉత్తరప్రదేశ్ జట్టుపై విజయం సాధించింది. చివరి నిమిషం వరకు హోరాహోరీగా సాగిన పోరులో తెలుగు టాలన్స్ ఒక్క గోల్ తేడాతో గెలుపొందింది. గత మ్యాచ్లో 11 గోల్స్ తేడాతో నెగ్గిన టాలన్స్.. ఈ సారి ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసుకుంది. టాలన్స్ తరఫున దేవేందర్ సింగ్ సత్తాచాటాడు.