టోక్యో: జపాన్ ఓపెన్లో తెలుగమ్మాయి పీవీ సింధు సెమీస్కు ప్రవేశించింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్ పోరులో భాగంగా శుక్రవారం నొజొమి ఒకుహరతో సింధు తలపడాల్సింది. కానీ, కాలి గాయం కారణంగా జపాన్ ప్లేయర్ వాకోవర్ ఇవ్వడంతో సింధు సెమీస్కు అర్హత సాధించింది. కాగా జపాన్ ఓపెన్లో సింధుకు ఇదే తొలి సెమీస్.
2023 డెన్మార్క్ ఓపెన్ 750లో లాస్ట్-4కు చేరుకున్న తర్వాత బీడబ్ల్యూఎఫ్ 750 ఈవెంట్లో సెమీఫైనల్స్కు వెళ్లడం మూడేండ్ల తర్వాత ఆమెకు ఇది మొదటిసారి. సెమీస్లో ఆమె.. చైనాకు చెందిన ప్రపంచ నాలుగో ర్యాంకర్ చెన్ యూఫీతో తలపడనుంది. ఈ ఇద్దరి మధ్య ముఖాముఖి పోరుల్లో చైనా షట్లర్ 8-6తో ముందంజలో ఉండటం గమనార్హం.