హైదరాబాద్, నమస్తే తెలంగాణ: జాతీయ క్రీడల్లో పసిడి పతకం సాధించిన రాష్ట్ర యువ షూటర్ ఇషాసింగ్పై ప్రశంసల జల్లు కురుస్తున్నది.
మహిళల 25మీటర్ల పిస్టల్ విభాగంలో రాష్ర్టానికి పసిడి పతకం అందించిన ఇషాసింగ్ను క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు. బీఆర్కే భవన్లో ఇషాను శాలువాతో సత్కరించారు. బరిలోకి దిగిన తొలిసారి పతకం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.