ఉత్పత్తి 4.24% పెరుగుతుందని అంచనా
న్యూఢిల్లీ, మార్చి 8: దేశంలో ఈ ఏడాది జూన్తో ముగియనున్న ప్రస్తుత పంట సంవత్సరం (2020-21)లో మామిడి పండ్ల ఉత్పత్తి 4.24 శాతం పెరుగుతుందని భావిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. 2019-20 పంట సంవత్సరంలో 20.26 మిలియన్ టన్నులుగా ఉన్న మామిడి ఉత్పత్తి ఈసారి 21.12 మిలియన్ టన్నులకు చేరుతుందని అంచనా వేసింది. దక్షిణాది రాష్ర్టాలతోపాటు పశ్చిమ రాష్ర్టాల నుంచి మామిడి పండ్ల రాక ఇప్పటికే ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ లాంటి ఉత్తరాది రాష్ర్టాల్లో ఈ సీజన్ జూన్ మధ్య నుంచి ప్రారంభమవుతుంది. మామిడితోపాటు ఇతక దిగుబడులపై కేంద్ర వ్యవసాయ శాఖ అంచనాలు ఇవీ..
పంట 2019-20 2020-21
(టన్నుల్లో) (టన్నుల్లో)
కర్బూజ 13,60,000 13,00,000
పుచ్చ 31,50,000 31,20,000
అరటి 3,25,90,000 3,37,50,000
టొమాటో 2,11,70,000 2,01,40,000
ఉల్లి 2,60,90,000 2,62,90,000
బంగాళాదుంప 4,85,60,000 5,31,10,000
తేనె 1,20,000 1,20,000