హైదరాబాద్, ఆట ప్రతినిధి: పుదుచ్చేరిలో జరిగిన ఆల్ఇండియా హైకోర్టు లాయర్ల క్రికెట్ టోర్నీలో తెలంగాణ జట్టు విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో తెలంగాణ 35 పరుగుల తేడాతో అలహాబాద్ హైకోర్టు న్యాయవాదుల టీమ్పై గెలిచింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన రాష్ట్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 165 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో అలహాబాద్ 130 పరుగులకు ఆలౌటైంది. టైటిల్ దక్కించుకున్న తెలంగాణ జట్టుకు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయన్, బార్కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, వైస్ చైర్మన్ సునీల్గౌడ్ అభినందనలు తెలిపారు.