న్యూఢిల్లీ: స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నమెంట్లో పాల్గొనే భారత బృందంలో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ (52 కేజీలు) చోటు దక్కించుకుంది. బల్గేరియా వేదికగా జరుగుతున్న మెగా టోర్నీ కోసం మన దేశం నుంచి 17 మంది బాక్సర్లు శుక్రవారం బయలుదేరారు. ఇందులో పది మంది మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు.