మొయినాబాద్: తెలంగాణ క్రీడా హబ్గా మారబోతున్నదని…ఇతర రాష్ర్టాల ప్లేయర్ల శిక్షణ ఇచ్చే కేంద్రంగా అభివృద్ధి చెందిందని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మొయినాబాద్లో జ్వాలా గుత్తా బ్యాడ్మింటన్ అకాడమీలో పంజాబ్కు చెందిన 35 మంది ప్లేయర్లకు శిక్షణనిచ్చారు. శనివారం జరిగిన ముగింపు కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఒలింపిక్స్లో సత్తాచాటేలా తెలంగాణ ప్లేయర్లను తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశాం. క్రీడల్లో రాణించే వారికి రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నాం’ అని అన్నారు.