హైదరాబాద్, ఆట ప్రతినిధి: విశాఖపట్నం వేదికగా జరుగుతున్న 39వ జాతీయ జూనియర్ సాఫ్ట్బాల్ చాంపియన్షిప్లో తెలంగాణ బాలికల జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో తెలంగాణ టీమ్ 8-2 తేడాతో మహారాష్ట్రపై అద్భుత విజయం సాధించింది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్తో పాటు సూపర్ లీగ్ మ్యాచ్ల్లో గురుకుల విద్యార్థులతో కూడిన మన జట్టు అలవోకగా గెలిచింది.