అన్నదాతలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి
ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నది
జిల్లా సహకార శాఖ అధికారి సంజీవరెడ్డిa
నర్సంపేట రూరల్, మే 3: రైతుల ఆర్థికాభివృద్ధికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎంతో దోహదం చేస్తాయని జిల్లా సహకార శాఖ అధికారి సంజీవరెడ్డి అన్నారు. మండలంలోని ముగ్ధుంపురంలో శ్రీరామ ధాన్య రైతు విత్తన సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంజీవరెడ్డి మాట్లాడుతూ అన్ని గ్రామాల రైతులు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని కోరారు. రైతులు విధిగా భౌతికదూరం పాటించాలని తెలిపారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కరోనా ప్రభావం రైతులపై పడకుండా ప్రభుత్వమే మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో శ్రీరామ ధాన్య రైతు విత్తన సహకార సంఘం అధ్యక్షుడు అర్శనపెల్లి మాధవరావు, నోడల్ ఆఫీసర్ ఈరునాయక్, సంఘం పాలకవర్గం గోపు జయపాల్రెడ్డి, గుర్రం నర్సింహారెడ్డి, సిద్ధ సుధాకర్, నాంపెల్లి సాంబయ్య, చల్లా మల్లారెడ్డి, ఆర్ఎస్ఎస్ కన్వీనర్ ఏ వెంకటేశ్వర్లు, సంఘం సిబ్బంది నామాల నరేశ్, చల్లా శ్రీనివాస్రెడ్డి, ఉప్పుల భిక్షపతి, రైతులు పాల్గొన్నారు.
మద్దతు ధరతో కొనుగోళ్లు..
పరకాల: రైతుల నుంచి ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నట్లు ఎంపీపీ తక్కళ్లపల్లి స్వర్ణలత అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో జడ్పీటీసీ సిలివేరు మొగిలితో కలిసి ఆమె ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు దళారుల బారిన పడి మోసపోకుండా సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎంపీపీ తెలిపారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్కు రూ. 1888, బీ గ్రేడ్ ధాన్యానికి రూ. 1688 మద్దతు చెల్లిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి కే సురేఖ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నందికొండ జైపాల్రెడ్డి, మార్కెట్ కార్యదర్శి వీ వెంకటేశ్వర్లు, సూపర్వైజర్ వేణుగోపాల్ పాల్గొన్నారు.
రైతుల సమగ్రాభివృద్ధే ధ్యేయం
ఖానాపురం: రైతుల సమగ్రాభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు అన్నారు. చెన్నారావుపేట సొసైటీ ఆధ్వర్యంలో రాగంపేటలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ ముద్దసాని సత్యనారాయణరెడ్డితో కలిసి ఎంపీపీ ప్రారంభించారు. ధాన్యాన్ని తాలు లేకుండా తీసుకురావాలని రైతులను కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ బీ ఐలయ్య, సొసైటీ డైరెక్టర్లు వంశీ, బాబు, రమాదేవి, రాంచంద్రయ్య, రాంబాబు, సరిత, బషీర్, ఫూల్ శంకర్, సాంబారెడ్డి, మంజుల, కవిత, గోపి, సొసైటీ సీఈవో చిట్టెం రవి, సిబ్బంది రాఘవులు, శ్రీను పాల్గొన్నారు.
రైతులు కరోనా నిబంధనలు పాటించాలి
దుగ్గొండి: రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద కరోనా నిబంధనలు పాటించాలని జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ కోరారు. మండలంలోని మందపల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కాట్ల కోమల, మందపల్లి, నాచినపల్లి పీఏసీఎస్ల చైర్మన్లు గుడిపెల్లి రాంరెడ్డి, సుకినె రాజేశ్వర్రావు, రైతుబంధు సమితి జిల్లా కమిటీ సభ్యుడు కాట్ల భద్రయ్య, వైస్ చైర్మన్ సింగతి కార్తీక్, టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు ఆమంచ లక్ష్మణ్ పాల్గొన్నారు.
నడికూడ: చర్లపల్లి, చౌటుపర్తి, రాయపర్తిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ మచ్చ అనసూర్య, పీఏసీఎస్ చైర్మన్ నల్లెల లింగమూర్తి ప్రారంభించారు. సర్పంచ్లు చాడ తిరుపతిరెడ్డి, గూడెం కృష్ణమూర్తి, రావుల సరిత-రాజిరెడ్డి, జడ్పీటీసి కోడెపాక సమలత-కరుణాకర్, ఏపీవో రమాదేవి, రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ బొల్లె భిక్షపతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భీమిడి నాగిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి దురిశెట్టి చందు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు తిప్పర్తి సాంబశివారెడ్డి పాల్గొన్నారు.
రైతు సేవలో తెలంగాణ ప్రభుత్వం
ఆత్మకూరు: దేశంలోని ఏ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని, కేవలం తెలంగాణలో సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేస్తూ రైతు సేవలో తరిస్తున్నారని జడ్పీటీసీ కక్కెర్ల రాధిక అన్నారు. మండలంలోని హౌసుబుజుర్గు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్లు హుస్సేన్బేగం, మచ్చిక యాదగిరి, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు మార్క రజినీకర్గౌడ్, గూడెప్పాడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నిమ్మల స్వరూప భిక్షపతి పాల్గొన్నారు. అలాగే, పెంచికలపేట పీఏసీఎస్ ఆధ్వర్యంలో నీరుకుళ్లలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ చైర్మన్ కంది శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ పోతురాజు రాజు, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ రవీందర్, మండల నోడల్ అధికారి నాగ్నారాయణ, ఏఈవో మానస, పెంచికలపేట సర్పంచ్ కోరె లలిత, ఎంపీటీసీ అర్షం వరుణ్గాంధీ, సొసైటీ డైరెక్టర్లు తోట శేఖర్, ఉడుత రాజేందర్, పిట్టల సూరయ్య, కే రమేశ్, సీఈవో లక్ష్యయ్య పాల్గొన్నారు.
శాయంపేట: కాట్రపల్లిలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్రెడ్డి, పెద్దకోడెపాకలో సర్పంచ్ అబ్బు ప్రకాశ్రెడ్డి ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో పెద్దకోడెపాక ఉప సర్పంచ్ గట్టు సుజాత-రవి, ఎంపీటీసీ మాచర్ల మంగమ్మ-రవి, వావిలాల వేణుగోపాల్, మండల కోఆప్షన్ సభ్యుడు మోహినొద్దిన్, ఐకేపీ ఏపీఎం శ్రీధర్రెడ్డి, కాట్రపల్లిలో సర్పంచ్ వనమ్మ, ఉప సర్పంచ్ ఏ జాయ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ ఉమ, ఐకేపీ నిర్వాహకులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి
చెన్నారావుపేట: ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని జడ్పీటీసీ పత్తినాయక్ రైతులను కోరారు. చెన్నారావుపేట, అమీనాబాద్ సొసైటీల ఆధ్వర్యంలో పాపయ్యపేట, అమీనాబాద్, తిమ్మరాయిన్పహాడ్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సొసైటీల చైర్మన్లు ముద్దసాని సత్యనారాయణరెడ్డి, మురహరి రవి, ఆర్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ బుర్రి తిరుపతి ప్రారంభించారు. పాపయ్యపేట, తిమ్మరాయిన్పహాడ్, అమీనాబాద్ సర్పంచ్లు ఉప్పెర లక్ష్మి-వెంకటేశ్వర్లు, కొండవీటి పావని-ప్రదీప్, సిద్దెన రమేశ్, అమీనాబాద్ ఎంపీటీసీ కడారి సునీత-సాయిలు పాల్గొన్నారు. అలాగే, ఐకేపీ ఆధ్వర్యంలో పాపయ్యపేట-2, కోనాపురంలో కొనుగోలు కేంద్రాలను ఏపీఎం ముక్కెర ఈశ్వరయ్య, సర్పంచ్లు ఉప్పెర లక్ష్మి-వెంకటేశ్వర్లు, వెల్దె సుజాత-సారంగం ప్రారంభించారు. సుదర్శన్గౌడ్, బోడ వెంకన్న, అరుణ-వీరాసింగ్, యాదమ్మ, శారద, మాధవి, తిరుమల, లావణ్య, అనిత, జ్యోతి, స్వరూప పాల్గొన్నారు.
సంగెం: మండలంలోని లోహిత, చింతలపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ కందకట్ల కళావతి ప్రారంభించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ కందకట్ల నరహరి, సర్పంచ్లు నాగినేని జ్యోతి జగన్మోహన్రావు, గుగులోత్ రవి, ఇండ్ల రవికుమార్, ఎంపీటీసీ అడ్డగట్ల దుర్గారావు, చింతలపల్లి సొసైటీ చైర్మన్ వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ బండి రాధిక, రైతుబంధు సమితి మండల కన్వీనర్ బొమ్మగాని యుగేంధర్, పోశాల సతీశ్, ఐకేపీ ఏపీఎం దుంపటి కిషన్, సీసీలు కృష్ణమూర్తి, రాజయ్య పాల్గొన్నారు.
రైతుల శ్రేయస్సే సర్కారు ధ్యేయం
నెక్కొండ: మండలంలోని దీక్షకుంట, చంద్రుగొండలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ జాటోత్ రమేశ్ ప్రారంభించారు. రైతు శ్రేయస్సే ధ్యేయంగా టీఆర్ఎస్ సర్కారు పని చేస్తున్నదని ఎంపీపీ అన్నారు. కార్యక్రమంలో దీక్షకుంట సర్పంచ్ ఆలకుంట సురేందర్, ఎంపీటీసీ లింగాల అజయ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ధర్మారెడ్డి, చంద్రుగొండ సర్పంచ్ బక్కి రాజమ్మ, ఉప సర్పంచ్ ఎర్ర సతీశ్, మండల నాయకులు కట్కూరి నరేందర్రెడ్డి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు జీ రజిత, ఏపీఎం శ్రీనివాస్ పాల్గొన్నారు.
పర్వతగిరి: మండలంలోని చింతనెక్కొండ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ గటిక సుష్మ ప్రారంభించారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం తోటకూరి కృష్ణమూర్తి, ఉపసర్పంచ్ ధర్నోజు దేవేందర్, జీ మహేశ్, ఎంపీటీసీలు మౌనిక, సుభాషిణి, సీసీలు వర్కాల సుధాకర్, వార్డు సభ్యులు రజిత, లక్ష్మి, రైతుబంధు సమితి సభ్యులు మోహన్రావు, ప్రభాకర్రావు, కొమురయ్య, ఐకేపీ ప్రతినిధులు పాల్గొన్నారు.
నల్లబెల్లి: మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ ఊడ్గుల సునీత-ప్రవీణ్గౌడ్, వైస్ ఎంపీపీ గద్దె శ్రీలత ప్రారంభించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్, నోడల్ ఆఫీసర్ తోట శ్రీనివాస్, సీఈవో నాగెళ్లి మొగిలి, పీఏసీఎస్ డైరెక్టర్ బత్తిని మహేశ్, ఆర్ఎస్ఎస్ మండల కన్వీనర్ గోనెల పద్మ, సర్పంచ్ మామిండ్ల మోహన్రెడ్డి, నల్లబెల్లి మాజీ సర్పంచ్ కొత్తపల్లి కోటిలింగాచారి, గద్దె శ్రీనివాస్గుప్తా, నరహరి పాల్గొన్నారు.