Hemant Soren | జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేసిన దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పు ఇవ్వడం లేదంటూ ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. తన పిటిషన్పై ఫిబ్రవరి 28న హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసిందని.. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సోరెన్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనానికి తెలిపారు.
ఈడీ సోరెన్ను జనవరి 31న అరెస్టు చేసింది. భూ కుంభకోణం కేసులో మనీలాండరింగ్కు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. సోరెన్ ప్రస్తుతం రాంచీలోని బిర్సా ముండా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో సోరెన్ బెయిల్ పిటిషన్పై స్పందించేందుకు ఈడీకి హైకోర్టు మరో వారం గడువు ఇచ్చింది. రాంచీలోని 8.86 ఎకరాల భూమికి సంబంధించిన కేసులో ఈడీ మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసింది. భూ కుంభకోణం ఆరోపణలను సోరెన్ కొట్టిపడేశారు. తనపై కేసు రాజకీయ ప్రేరేపితమని.. బీజేపీలో చేరడానికి ప్రణాళికాబద్ధమైన కుట్రలో భాగమని ఆయన ఆరోపించారు.