YS Sharmila | ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్పై ఆయన సోదరి.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాజకీయాలు, అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి జగన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బొత్స సత్యనారాయణ గతంలో వైఎస్సార్ను తాగుబోతు అని అన్నాడని.. విజయమ్మపై కించపరిచే వ్యాఖ్యలు చేశారన్నారు. అలాంటి వ్యక్తి జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడని.. తమ తల్లిదండ్రుల గురించి నీచంగా మాట్లాడిన బొత్స సత్యనారాయణ.. ఇప్పుడు జగన్కు తండ్రి సమానులయ్యారా అంటూ ధ్వజమెత్తారు.
జగన్ మంత్రి వర్గంలో ఉన్నవాళ్లంతా గతంలో వైఎస్సార్ను తిట్టిన వాళ్లేనన్నారు. ఇదే బొత్స సత్యనారాయణ గతంలో జగన్కు ఉరివేయాలని అన్నారని గుర్తు చేశారు. వైఎస్ను తిట్టిన వారికే జగన్ పెద్దపీట వేశారని.. తండ్రినితిట్టిన వాళ్లంతా జగన్క తండ్రులు, అక్కలు, చెల్లెళ్లు అయ్యారని విమర్శించారు. జగన్ కోసం పాదయాత్రలు చేసిన వారంతా ఆయనకు ఏమీ కారన్నారు. వైఎస్సార్ కోసం పని చేసి గొడ్డలిపోటుకు గురై ప్రాణాలు కోల్పోయిన వారు సైతం ఏమీ కారన్నారు. వైఎస్సార్ సీపీ పార్టీలో వైఎస్సార్ లేడని.. వై అంటే.. వైవీ సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అని విమర్శించారు.