Asia cup 2023 | 145 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగి టీం ఇండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే విజయం సాధించారు. ఆసియా కప్ లో నేపాల్ -భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మరో 17 బంతులు మిగిలి ఉండగానే.. శుభ్ మన్ గిల్ ఫోర్ కొట్టి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. రోహిత్ శర్మ 59 బంతుల్లో ఐదు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 74 పరుగులు, శుభ్ మన్ గిల్ ఒక సిక్సర్, ఎనిమిది ఫోర్లతో 67 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. రోహిత్, శుభ్ మన్ గిల్ 145 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
శ్రీలంకలో జరుగుతున్న ఆసియా కప్ లో ఇండియా-నేపాల్ మధ్య మ్యాచ్ జరుగుతుండగానే వర్షం కురవడంతో మధ్యలోనే మ్యాచ్ నిలిపివేశారు. భారత్ బ్యాటర్లు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రెండు ఓవర్లకే వర్షం మొదలైంది. అప్పటికి ఓపెనర్లు రోహిత్ శర్మ 4, శుభ్ మన్ గిల్ 12 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. వర్షం నిలిచిపోవడంతో 10.15 గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. వర్షం ఆటంకం కలిగించడంతో మ్యాచ్ను 23 ఓవర్లకు కుదించారు. డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్ విజయ లక్ష్యం 145 పరుగులుగా నిర్ణయించారు.