IND vs WI | టీమిండియా, వెస్టిండీస్ మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్లో కూడా టీమిండియా విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్లో వెస్టిండీస్ను ఓడించి 3-0 తేడాతో సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. మూడో వన్డేలో భాగంగా అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 265 పరుగులు చేసి వెస్టిండీస్కు 266 పరుగుల లక్ష్యాన్ని అందించింది.
ఆ తర్వాత బరిలోకి దిగిన వెస్టిండీస్ 37.1 ఓవర్లకే ఆలౌట్ అయింది. కేవలం 169 పరుగులే చేయడంతో భారత్.. 96 పరుగుల తేడాతో గెలిచింది.
WHAT. A. WIN! 👌 👌@prasidh43 gets the last West Indies wicket & @imVkohli takes the catch as the @ImRo45-led #TeamIndia win the third @Paytm #INDvWI ODI by 96 runs to complete the series sweep. 👏 👏
Scorecard ▶️ https://t.co/9pGAfWtQZV pic.twitter.com/bR7KzaBTDx
— BCCI (@BCCI) February 11, 2022
భారత ఆటగాళ్లలో శ్రెయాస్ అయ్యర్ 80 పరుగులు చేసి టీమిండియాకు ఎక్కువ పరుగులు అందించాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ 56, దీపక్ చాహర్ 38, వాషింగ్టన్ సుందర్ 33, కెప్టెన్ రోహిత్ శర్మ 13, శిఖర్ ధావన్ 10 పరుగులు చేశారు.
టీమిండియా బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, కృష్ణ చెరో మూడు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు.