పల్లెకెలె: గాయం నుంచి పూర్తిస్థాయిలో కోలుకోకపోవడంతో.. ఆసియాకప్ తొలి రెండు మ్యాచ్లకు దూరమైన టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వన్డే ప్రపంచకప్కు ఎంపికవడం ఖాయమైంది. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఉన్న రాహుల్ ఫిట్నెస్ నిరూపించుకొని క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందాడు. దీంతో అతడు త్వరలోనే జట్టుతో చేరనున్నాడు.
ప్రస్తుతం రాహుల్కు బ్యాకప్గా కొనసాగుతున్న సంజూ శాంసన్కు వన్డే వరల్డ్కప్ దారులు మూసుకుపోయినట్లే. రాహుల్కు క్లియరెన్స్ లభించడంతో సెలెక్షన్ కమిటీ త్వరలో వన్డే ప్రపంచకప్ కోసం ప్రాథమిక జట్టును ప్రకటించే అవకాశం ఉంది. 15 మందితో వెల్లడించనున్న జట్టులో తిలక్ వర్మ, సంజూ శాంసన్, ప్రసిద్ధ్ కృష్ణకు చోటు దక్కడం కష్టమే.