Team India : ఆసియా కప్(Asia cup 2023)లో నేపాల్తో జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా(Team India) పేలవమైన ఫీల్డింగ్ చేసింది. అపార అనుభవం ఉన్న ఆటగాళ్లు సైతం.. కొత్త కుర్రాళ్లలా తడబడి ప్రత్యర్థికి ఇతోధిక సాయం చేశారు. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ సులువైన క్యాచ్లు వదిలేసి విమర్శల పాలవ్వగా.. మిగిలిన వాళ్లు కూడా మైదానంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.
తొలి 5 ఓవర్లలోనే నేపాల్ బ్యాటర్లు ఇచ్చిన మూడు క్యాచ్లు నేలపాలు చేశారు. దీంతో ఆ జట్టు మంచి స్కోరు చేయగలిగింది. ఇప్పుడు అనే కాదు 2019 వన్డే ప్రపంచ కప్ తర్వాత ఇతర జట్లతో పోల్చుకుంటే.. టీమ్ఇండియా ఫీల్డింగే పేలవంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
క్యాచ్ జారవిడిచిన కోహ్లీ
ఈ జాబితాలో 75.1 శాతంతో భారత్ తొమ్మిదో స్థానంలో ఉంది. చేతిలోకి వచ్చిన క్యాచ్లు కూడా వదిలేస్తారనే ముద్ర పడ్డ పాకిస్థాన్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉండటం గమనార్హం. 82.8 శాతం క్యాచ్లు పట్టే సామర్థ్యంతో ఇంగ్లండ్ అగ్రస్థానంలో ఉంది. పాకిస్థాన్ (81.6 శాతం), న్యూజిలాండ్ (80.9 శాతం) వరుసగా ద్వితీయ, తృతీయ ప్లేస్ల్లో నిలిచాయి. బంగ్లాదేశ్ కూడా (75.8 శాతం) భారత జట్టు కంటే మెరుగైన స్థానంలో ఉండటం కొసమెరుపు. వన్డే ప్రపంచ కప్(ODI World Cup 2023) ప్రారంభానికి ఇంకా నెలరోజుల వ్యవధి మాత్రమే ఉండగా.. మనవాళ్ల ఫీల్డింగ్ మేనేజ్మెంట్తో పాటు అభిమానులను కలవరపెడుతోంది.