Gautam Gambhir : భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్(Gautam Gambhir) మరోసారి వివాదాస్పద ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. ఆసియా కప్(Asia cup 2023)లో నేపాల్తో టీమిండియా మ్యాచ్కు కామెంటేటర్గా వచ్చిన అతడు ఫ్యాన్స్కు మిడిల్ ఫింగర్(Middle Finger) చూపించాడు. ఇప్పుడు ఆ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగిందంటే..? పల్లెకెల్ స్టేడియంలో గంభీర్ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. అతడిని గమనించిన అభిమానులు కొందరు ‘కోహ్లీ.. కోహ్లీ’ అంటూ గట్టిగా అరిచారు. దాంతో, చిర్రెత్తుకొచ్చిన గౌతీ వెనక్కి తిరిగి వాళ్లకు మిడిల్ ఫింగర్ చూపించాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ వీడియో చూసినవాళ్లంతా గంభీర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే… పలువురు గంభీర్కు మద్దతు పలుకుతుండగా.. కొందరు మాత్రం అభిమానులు ఉత్సాహంలో ఏదో అరుస్తుంటే.. దానికి అంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని కామెంట్ చేస్తున్నారు.
లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) మెంటార్గా వ్యవహరిస్తున్న గంభీర్ 16వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)తో మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీతో గొడవకు దిగాడు. మ్యాచ్ మధ్యలో కోహ్లీ, లక్నో బౌలర్ నవీన్ ఉల్ హక్ మధ్య చిన్న పాటి వాగ్వాదం జరిగింది. దాంతో, మ్యాచ్ అనంతరం కోహ్లీ దానిపై నవీన్తో మాట్లాడుతుననాడు. అక్కడికి వచ్చిన గంభీర్ తీవ్ర స్థాయిలో కోహ్లీని దూషించాడు. ఈ సంఘటన మనసులో పెట్టుకున్న కోహ్లీ ఫ్యాన్స్ ఆ తర్వాత నుంచి గంభీర్ ఎక్కడ కనిపించినా.. ‘కోహ్లీ, కోహ్లీ’ అంటూ బిగ్గరగా అరవడం ప్రారంభించారు.