INDvsSA 3rd Test: టీమిండియా సారథి రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. భారత్ తరఫున టెస్టులు ఆడుతూ 2021, 2023లలో శతకాలు నమోదుచేసిన తొలి బ్యాటర్గా నిలిచాడు. పరిమిత ఓవర్ల క్రికెట్తో పాటు టెస్టులలోనూ ఓపెనర్గా దిగుతున్న రోహిత్.. ఆ రెండేండ్లూ టీమిండియాకు తొలి సెంచరీలు చేసిన బ్యాటర్గా నిలిచాడు. బుధవారం నుంచి కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగాల్సి ఉన్న రెండో టెస్టుతో భారత్ ఈ ఏడాది తమ ప్రయాణాన్ని ప్రారంభించనుంది.
2021లో రోహిత్.. ఇంగ్లండ్లోని ది ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్లో శతకం సాధించాడు. గతేడాది కూడా వెస్టిండీస్ పర్యటనలో భాగంగా జులైలో జరిగిన మ్యాచ్లో రోహిత్ సెంచరీ చేశాడు. 2022లో టీమిండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ ఈ ఘనత దక్కించుకున్నాడు. కేప్టౌన్ వేదికగా జరుగబోయే రెండో టెస్టులో మరోసారి రోహిత్ సెంచరీ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రోహిత్ తో పాటు గిల్, కోహ్లీ, జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ వంటి బ్యాటర్లలో ఎవరు శతకం చేస్తారో చూడాలి.
ఇదివరకే సెంచూరియన్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో భారత్ దారుణ వైఫల్యంతో సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడింది. సిరీస్ దక్కించుకునే అవకాశం లేకపోయినా ఈ మ్యాచ్లో గెలిస్తే భారత్.. సిరీస్ను సమం చేసుకుంటుంది. మ్యాచ్ డ్రా అయినా సిరీస్ దక్షిణాఫ్రికాకే సొంతమవుతుంది.
Rohit Sharma scored the first Test hundred for India in 2021 & 2023.
– India will be playing their first Test of the year tomorrow. pic.twitter.com/qbRiGgC2l5
— Johns. (@CricCrazyJohns) January 2, 2024