Paris Olympics | పారిస్: ప్రతిష్టాత్మక విశ్వ క్రీడలకు ఆతిథ్యమిస్తున్న ఫ్రాన్స్ క్రీడాభిమానుల ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తూ ‘ఒలింపిక్ జ్యోతి’ బుధవారం ఆ దేశం చేరుకుంది. గత నెల 16న గ్రీస్ లోని ప్రఖ్యాత ఒలింపియా వద్ద మొదలైన ఒలింపిక్ టార్చ్ ర్యాలీ మూడు వారాల తర్వాత ఫ్రాన్స్కు దక్షిణాదిన ఉన్న మార్సే నగరానికి చేరింది.
ఏథెన్స్ నుంచి సముద్ర మార్గంలో సుమారు 12 రోజుల పాటు పురాతన బెలిమ్ అనే ఓడ ద్వారా ఒలింపిక్ జ్యోతి ఫ్రాన్స్కు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఒలింపిక్ జ్యోతికి ఘన స్వాగతం పలికింది. ఈ వేడుకలను ప్రత్యక్షంగా చూడటానికి మార్సే తీరానికి వేలాదిమంది క్రీడాభిమానులు తరలివచ్చారు.