అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM Tour) విదేశాలకు వెళ్లే్ందుకు సీబీఐ(CBI) కోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్ విచారణ ఈనెల 14వ తేదీకి వాయిదా పడింది . ఏపీలో ఈనెల 13న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన తరువాత ఈనెల 17 నుంచి జూన్ 1వ తేదీ వరకు లండన్ (London), ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాలకు వెళుతున్నానని , ఇందుకు అనుమతి కావాలంటూ సీబీఐ కోర్టులో జగన్ బుధవారం పిటిషన్ దాఖలు చేయగా,కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు సీబీఐని ఆదేశించింది.
దీంతో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్పై గురువారం విచారణ జరిగింది. అటు సీబీఐ న్యాయవాదులు, ఇటు జగన్ తరుఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. జగన్పై 11 కేసులు విచారణలో ఉన్నాయని, వీటిలో ప్రధాన కేసు ఈనెల 15న విచారణకు రానున్నందున విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వవద్దని సీబీఐ వాదించింది . గతంలో జగన్ అనేక సార్లు విదేశాలకు వెళ్లారని, ఎక్కడ కూడా కోర్టు నిబంధనలు ఉల్లంఘించలేదని జగన్ న్యాయవాదులు కోర్టు్ దృష్టికి తీసుకొచ్చారు. ఇరువాదనలు విన్న కోర్టు తీర్పును మే 14వ తేదీకి వాయిదా వేసింది .