R Ashiwn : టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(R Ashiwn) ఏడాది నిరీక్షణ ఫలించింది. ఈ ఆల్రౌండర్ మళ్లీ వన్డే జట్టులోకి వచ్చాడు. ఆస్ట్రేలియా(Australia)తో మూడు వన్డేల సిరీస్కు సెలెక్టర్లు అశ్విన్ను ఎంపిక చేశారు. దాంతో, సొంత గడ్డపై వన్డే వరల్డ్ కప్లో ఆడేందుకు మార్గం సుగమమైంది. సెప్టెంబర్ 24న ఆసీస్తో వన్డే సిరీస్ షురూ కానుంది.
అయితే.. తొలి రెండు మ్యాచ్లకు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya), స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli), కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav)లకు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఈ రెండు మ్యాచుల్లో ఇండియా కేఎల్ రాహుల్ సారథ్యంలో బరిలోకి దిగనుంది.
తొలి రెండు వన్డేలకు భారత బృందం : కేఎల్ రాహుల్(కెప్టెన్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, జడేజా, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, సిరాజ్, షమీ, తిలక్ వర్మ, ప్రసిధ్ కృష్ణ, అశ్విన్, వాషింగ్టన్ సుందర్.
Coming 🆙 next 👉 #INDvAUS
Here are the #TeamIndia squads for the IDFC First Bank three-match ODI series against Australia 🙌 pic.twitter.com/Jl7bLEz2tK
— BCCI (@BCCI) September 18, 2023
ఆసియా కప్ ఫైనల్(Asia Cup 2023 Final) అనంతరం కెప్టెన్ రోహిత్ వరల్డ్ కప్ స్క్వాడ్లో అశ్విన్, సుందర్ ఉండే చాన్స్ ఉందని చెప్పాడు. అంతేకాదు ఈ విషయమై అశ్విన్తో తాను ఫోన్లో మాట్లాడానని కూడా తెలిపాడు. ప్రపంచ కప్లో స్పిన్ ఆల్రౌండర్లు కీలకం కానున్నారు. అందుకనే అనుభవజ్ఞుడైన అశ్విన్కు మళ్లీ జట్టులోకి తీసుకున్నారు.
My kinda day 🤩🤩.
The capacity to learn is a gift.
The ability to learn is a skill. However, the willingness to learn is a CHOICE. #cricketlife
Thank you for the help @SairajBahutule @VVSLaxman281 pic.twitter.com/4nK7V5IthS— Ashwin 🇮🇳 (@ashwinravi99) September 15, 2023
అశ్విన్ ఎన్సీఏ(NCA)లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఈ సీనియర్ స్పిన్నర్ నిరుడు జనవరిలో దక్షిణాఫ్రికాపై చివరి మ్యాచ్ ఆడాడు. ఆసియా కప్లో శ్రీలంకతో జరిగిన ఆఖరి సూపర్ 4 మ్యాచ్లో అక్షర్ పటేల్(Axar Patel) గాయపడంతో, వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే.
అక్టోబర్ 5న వన్డే ప్రపంచ కప్ షురూ కానుంది. మెగా టోర్నీకి ముందు భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుఉంది. 24న మొహాలీలో తొలి వన్డేలో ఇరుజట్లు తలపడనున్నాయి. సెప్టెంబర్ 28 (ఇండోర్), అక్టోబర్ (1) రాజ్కోట్లో చివరి రెండు వన్డేలు జరుగనున్నాయి.