T20 World Cup | గత రెండు నెలలుగా ఉర్రూతలూగించిన ఐపీఎల్ సమరం ముగిసింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. ఇక ఐపీఎల్ 2024 ముగిసిందో లేదో.. మరో మెగా క్రికెట్ టోర్నీ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. టీ 20 వరల్డ్ కప్ 2024 (T20 World Cup 2024) మరో ఐదు రోజుల్లో ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే అన్ని జట్లు టీ20 సమరానికి సిద్ధమయ్యాయి.
ఈ వరల్డ్ కప్ కోసం టీమ్ ఇండియా (Team India ) జట్టు న్యూయార్క్ (New York) చేరుకుంది. ఐపీఎల్ ప్లేఆఫ్స్ ముగియడంతో ఫైనల్ ఆడే భారత క్రికెటర్లు తప్ప మిగిలినవాళ్లంతా మే 25 శనివారమే అమెరికా ఫ్లైట్ ఎక్కిన విషయం తెలిసిందే. తాజాగా వీరు న్యూయార్క్లో ల్యాండ్ అయ్యారు. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్తోపాటు కెప్టెన్ రోహిత్ శర్మ, రిషభ్ పంత్, శివం దూబే, కుల్దీప్ యాదవ్, సిరాజ్లు న్యూయార్క్ చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘టచ్డౌన్ న్యూయార్క్’ అంటూ బీసీసీఐ (BCCI) తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.
✈️ Touchdown New York! 🇺🇸👋#TeamIndia 🇮🇳 have arrived for the #T20WorldCup 😎 pic.twitter.com/3aBla48S6T
— BCCI (@BCCI) May 27, 2024
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ(BCCI) 19 మందితో కూడిన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ కాగా, హార్దిక్ పాండ్యను వైస్ కెప్టెన్గా నియమించారు. అందరూ ఊహించనట్టుగానే వికెట్ కీపర్లుగా రిషభ్ పంత్, సంజూ శాంసన్లను ప్రపంచకప్ స్క్వాడ్కు ఎంపికచేశారు. శుభ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అర్షద్ ఖాన్లు రిజర్వ ప్లేయర్లుగా ఎంపికయ్యారు.
భారత స్క్వాడ్ : రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్.
Also Read..
KKR Celebrations | డ్రెస్సింగ్ రూమ్లో అంబరాన్నంటిన కోల్కతా నైట్రైడర్స్ సెలబ్రేషన్స్.. VIDEO
Kavya Maran | ఫైనల్లో హైదరాబాద్ ఓటమి.. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న కావ్య మారన్
IPL 2024 | కోల్కతా తీన్మార్.. మూడోసారి ఐపీఎల్ చాంప్గా కోల్కతా నైట్రైడర్స్