పొట్టి ప్రపంచకప్ ముందు పెర్త్లో రెండు ప్రాక్టీస్ మ్యాచులు ఆడిన టీమిండియా.. ఒక దానిలో నెగ్గి, రెండో దానిలో ఓటమిపాలైంది. ఈ రెండు మ్యాచుల్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆడలేదు. అయితే రెండో మ్యాచులో కోహ్లీతోపాటు సూర్యకుమార్ కూడా ఆడకపోవడం జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది.
ఈ ప్రాక్టీస్ మ్యాచుల్లో కొన్ని పాఠాలు నేర్చుకున్న టీమిండియా.. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు చివరగా రెండు వామప్ మ్యాచులు ఆడేందుకు సిద్ధమైంది. వీటిలో జట్టు వ్యూహాలకు తుదిమెరుగులు దిద్దుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే శనివారం నాడు భారత జట్టు బ్రిస్బేన్ చేరుకుంది.
ఈ వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. ఈ వీడియోలో భారత ఆటగాళ్లు అభిమానులకు అభివాదం చేస్తూ, ఆటోగ్రాఫ్లు ఇస్తూ కనిపించారు. ఇక్కడి గబ్బా మైదానంలో తొలుత ఆస్ట్రేలియాతో, అనంతరం న్యూజిల్యాండ్తో భారత జట్టు వామప్ మ్యాచులు ఆడుతుంది. అనంతరం వచ్చే ఆదివారం నాడు పాకిస్తాన్తో తన తొలి మ్యాచ్ ఆడుతుంది.
Touchdown Brisbane 📍#TeamIndia pic.twitter.com/HHof4Le3mP
— BCCI (@BCCI) October 15, 2022