దుబాయ్: ఫార్మాట్తో సంబంధం లేకుండా నిలకడగా రాణిస్తున్న టీమ్ఇండియా యంగ్స్టర్ శ్రేయస్ అయ్యర్కు.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’అవార్డు వరించింది. వెస్టిండీస్తో వన్డే సిరీస్లో సత్తాచాటిన శ్రేయస్.. శ్రీలంకతో టీ20 సిరీస్లో హ్యాట్రిక్ అర్ధశతకాలు (57, 74, 73) నమోదు చేశాడు. ఈ మూడు ఇన్నింగ్స్ల్లోనూ నాటౌట్గా నిలిచిన అయ్యర్.. సోమవారం ముగిసిన గులాబీ టెస్టు రెండు ఇన్నింగ్స్ల్లోనూ (92, 67) హాఫ్సెంచరీలతో రాణించి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.