మహిళా ప్రపంచకప్లో భారత్ తొలి ఓటమి చవిచూసింది. పాక్పై జరిగిన తొలి మ్యాచ్లో జయకేతనం ఎగరేసిన మిథాలీ సేన.. రెండో మ్యాచ్లో న్యూజిల్యాండ్తో తలపడుతున్న సంగతి తెలిసిందే. హామిల్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది.
భారత బౌలర్లను కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా కూడా.. కివీస్ బ్యాటర్లు అమీలియా కెర్ (50), అమీ సాటర్త్వెయిట్ (75), కెప్టెన్ సోఫీ డెవైన్ (35), కీపర్ కేటీ మార్టిన్ (41), మాడీ గ్రీన్ (27) రాణించడంతో ఆ జట్టు 50 ఓవర్లు ముగిసేసరికి 260/9 స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో కివీస్ బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు పరుగులు చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.
భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (6), దీప్తి శర్మ (5), రిచా ఘోష్ (0), పూజా వస్త్రాకర్ (6) తీవ్రంగా నిరాశపరిచారు. యాస్తికా భాటియా (28), స్నేహ్ రాణా (18), ఝులన్ గోస్వామి (15), మేఘనా సింగ్ (12 నాటౌట్), రాజేశ్వరి గైక్వాడ్ (0) పరుగులు చేశారు. కెప్టెన్ మిథాలీ రాజ్ (31), హర్మన్ప్రీత్ కౌర్ (71) మాత్రమే రాణించారు.
కివీస్ బౌలర్లలో లియా తహుహు, అమీలియా కెర్ చెరో మూడు వికెట్లు కూల్చగా.. హేలీ జాన్సెన్ 2 వికెట్లు పడగొట్టింది. జెస్ కెర్, హన్నా రోవ్ చెరో వికెట్ తీసుకున్నారు. దీంతో భారత జట్టు 46.4 ఓవర్లలోనే 198 పరుగులకు కుప్పకూలింది. కివీస్ జట్టు 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. సూపర్ ఇన్నింగ్స్ ఆడిన అమీ సాటర్త్వెయిట్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
A solid all-round performance gives New Zealand their second victory in #CWC22 🎉 pic.twitter.com/wpYNsxIOWA
— ICC (@ICC) March 10, 2022