న్యూఢిల్లీ : జూన్ 7-11 తేదీలలో జరుగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో పాల్గొనేందుకు టీమ్ ఇండియాకు చెందిన తొలి బృందం మంగళవారం లండన్ బయలుదేరి వెళ్లింది. విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కట్, రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని సహాయ సిబ్బంది మంగళవారం తెల్లవారు జామున 4.30 గంటలకు లండన్ బయల్దేరుతారు.
కాగా ఐపీఎల్ ప్లేఆఫ్స్లో ఆడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్, మహ్మద్ షమీ, కె.ఎస్.భరత్, అజింక్య రహానె ఐపీఎల్ ముగిసిన తరువాత ఇంగ్లండ్కు వెళతారు. కౌంటీల్లో ఆడుతున్న చతేశ్వర్ పుజారా జట్టుకు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ తెలిపింది. గత చాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచిన టీమ్ ఇండియా పదేళ్ల తరువాత ఒక ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న పట్టుదలతో ఉంది.