బర్మింగ్హామ్: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా వైరస్ నుంచి కోలుకున్నాడు. కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఇంగ్లండ్తో ఆఖరి టెస్టుకు దూరమైన హిట్మ్యాన్కు ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ అని తేలింది.
దీంతో గురువారం నుంచి ఇంగ్లండ్తో జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్కు రోహిత్ అందుబాటులో ఉండనున్నాడు. ‘రోహిత్కు కరోనా నెగెటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం అతడు ఐసొలేషన్ నుంచి బయకు వచ్చాడు. కాస్త సమయం తీసుకొని ప్రాక్టీస్ చేసిన అనంతరం ఇంగ్లండ్తో తొలి టీ20లో హిట్మ్యాన్ బరిలోకి దిగుతాడు’అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.