ముంబై: టీ20 క్రికెట్ చరిత్రలో 11 వేల పరుగుల మైలురాయి దాటిన రెండో ఇండియన్ క్రికెటర్గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఇవాళ ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH)తో మ్యాచ్ సందర్భంగా ఈ రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 37 బంతుల్లో 1 సిక్సర్, 8 ఫోర్లతో 56 పరుగులు చేసి మయాంక్ డాగర్ బౌలింగ్లో నితీశ్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
రోహిత్ శర్మ కంటే ముందు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 11 వేల పరుగుల క్లబ్లో చేరాడు. ప్రస్తుతం కోహ్లీ 11,864 పరుగులతో టీ20 క్రికెట్ చరిత్రలో 11 వేల పరుగులు దాటిన తొలి ఇండియన్గా ఉన్నాడు. రోహిత్ శర్మ 11,021 పరుగులతో ఆ తర్వాత స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తరఫున 5 వేల పరుగులు చేసిన ఆటగాడిగా కూడా రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు.