INDW vs AUSW : సొంత గడ్డపై ఇంగ్లండ్ను చిత్తుగా ఓడించిన టీమిండియా(Team India) ఇప్పుడు ఆస్ట్రేలియా(Australia)ను హడలెత్తిస్తోంది. ముంబైలోని వాంఖడేలో కంగారూలతో జరుగుతున్న ఏకైక టెస్టులో హర్మన్ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) సేన పటిష్ట స్థితిలో నిలిచింది. దీప్తి శర్మ(78), స్మృతి మంధానా(74), జెమీమా రోడ్రిగ్స్(73), రీచా ఘోష్(52) హాఫ్ సెంచరీలు బాదడంతో తొలి ఇన్నింగ్స్లో భారత్ 406 పరుగులు కొట్టింది.
టెస్టుల్లో ఆస్ట్రేలియాపై టీమిండియాకు ఇదే రికార్డు స్కోర్. దాంతో, భారత్కు 187 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ 6 ఓవర్లకు 23 రన్స్ చేసింది. ఓపెనర్లు ఫొబే లిచ్ఫీల్డ్(5), బేత్ మూనీ(18) ధాటిగా ఆడుతున్నారు. టీమిండియా స్కోర్కు ఆస్ట్రేలియా ఇంకా 164 పరుగులు వెనకబడి ఉంది.
India post their highest-ever total against Australia in Women’s Tests.#INDvAUS | 📝: https://t.co/EUDgkFPP0X pic.twitter.com/6c3onUtAEm
— ICC (@ICC) December 23, 2023
ఓవర్నైట్ స్కోర్ 376తో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ మూడో రోజు తొలి సెషన్లోనే ఆలౌట్ అయింది. మ్యాచ్ మొదలైన కాసేపటికే డేంజరస్ పూజా వస్త్రాకర్(47)ను సథర్లాండ్ వెనక్కి పంపింది. ఆ తర్వాత కిమ్ గార్త్ సూపర్ బంతితో దీప్తి శర్మను బౌల్డ్ చేసింది. రేణుకా సింగ్(8) చివరి వికెట్గా వెనుదిరగడంతో 406 పరుగుల వద్ద భారత ఇన్నింగ్స్ ముగిసింది. ఆసీస్ బౌలర్లలో అషే గార్డ్నర్ నాలుగు, కిమ్ గార్త్, సథర్లాండ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.