WPL Auction 2024 : మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ మినీ వేలంలో అనామక క్రికెటర్లు కోట్లు కొల్లగొట్టారు. సీనియర్లను కాదని ప్రతిభావంతులైన యువ కెరటాలను దక్కించుకునేందుకు ఐదు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. పంజాబ్ యువ పేసర్ కాశ్వి గౌతమ్(Kashvi Gautam) ఏకంగా రూ. 2 కోట్ల ధర పలికింది. కర్నాటకు చెందిన వృందా దినేశ్(Vrinda Dinesh) సైతం రూ.1.3 కోట్లు కొల్లగొట్టింది. ఈ లిస్ట్లో తమిళనాడు ఆల్రౌండర్ కీర్తనా బాలకృష్ణన్(Keerthana Balakrishnan) కూడా ఒకరు.
టాక్సీ డ్రైవర్ కూతురు అయిన ఆమె డబ్ల్యూపీఎల్ వేలంతో వార్తల్లో నిలిచింది. ముంబైలో శనివారం జరిగిన ఆక్షన్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్(Mumbai Indians).. కీర్తనను రూ. 10 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది.
Displaying our newest addition into the #OneFamily, proudly ☺️
PS: 💯 points if you’re a foodie, Keerthana Balakrishnan 😋💙#AaliRe #TATAWPLAuction #WPLAuction pic.twitter.com/jEnVnxWemO
— Mumbai Indians (@mipaltan) December 9, 2023
దాంతో, తమిళనాడు నుంచి డబ్ల్యూఎల్ ఆడనున్న తొలి క్రికెటర్గా కీర్తన రికార్డు సృష్టించింది. తమ కూతురుని పెద్ద జట్టు కొనడంతో కీర్తన తల్లిందండ్రుల సంతోషానికి అంతే లేకుండా పోయింది. కీర్తన డబ్ల్యూపీఎల్ ఎంట్రీని భారత జట్టు మాజీ ఆటగాడు దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) స్వాగతించాడు.
There are many heroes in the cricketing world , not all wear capes tho 😊
Here is one that not many have heard of
T.S.MUKUND
Father of Indian cricketer ABHINAV MUKUNDHe doesn’t charge a penny from a lot of cricketers from the lower strata of society and gives them coaching,… pic.twitter.com/IGUoSM5GkG
— DK (@DineshKarthik) December 10, 2023
పేదింట్లో పుట్టిన కీర్తన క్రికెటర్ అవ్వాలని కలలు కన్నది. ఆమె ఇష్టాన్నితల్లిదండ్రలు కాదనలేదు. రోజంతా టాక్సీ నడిపితేగానీ ఇల్లు గడవని పరిస్థితిలోనూ ఆమె తండ్రి కీర్తనను క్రికెటర్గా చూడం కోసం ఎంతో కష్టపడ్డాడు. వెటరన్ బ్యాటర్ అభినవ్ ముకుంద్ తండ్రి టీఎస్ ముకుంద్(TS Mukund) అకాడమీలో చేర్పించాడు. అక్కడికి వెళ్లాక కీర్తన తన ఆటను మరింత మెరుగుపరుచుకుంది. లెగ్ స్పిన్నర్ అయిన ఆమెకు లోయర్ ఆర్డర్లో బ్యాటుతో రాణించగల సత్తా ఉంది. ఫస్ట్ క్లాస్లో కీర్తనా తమిళనాడు మహిళల జట్టుతో పాటు ఇండియా గ్రీన్ ఉమెన్ జట్ల తరఫున ఆడింది.