ఖమ్మం : ప్రేమిస్తున్నాని చెప్పి శారీరకంగా లోబర్చుకొని మోసం చేసిన యువకుడి ఇంటి ముందు ఓ యువతి(Girlfriend) ధర్నాకు(Strike) దిగింది. ఈ ఘటన ఖమ్మం(Khammam) జిల్లా కాకరవాయి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఓ దళిత యువతిని అదే ప్రాంతానికి చెందిన బీసీ వర్గంలోని గోపాలకృష్ణ అనే యువకుడు ఇన్ స్టాగ్రాం యాప్ ద్వారా ఆమెను పరిచయం చేసుకున్నాడు.
వారి మధ్య ఉన్న పరిచయం కాస్తా పెరగడంతో తర్వాత వారు ఒకే ప్రాంతం వాసులమని తెలుసుకున్నారు.ఈ క్రమంలో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వారిద్దరు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. దీంతో ఆ యువకుడి మాటలు నమ్మిన యువతి అతనితో శారీరకంగా కలిసింది. అలా పలుమార్లు జరిగిన తర్వాత ఆ యువతి పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో అతను ముఖం చాటేశాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు తనకు న్యాయం చేయాలని శనివారం ప్రియుడి ఇంటి ఎదుట కూర్చుని మౌన పోరాటానికి దిగింది.