IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)టైటిల్ హక్కులను టాటా గ్రూప్ (TATA Group) కంపెనీ దక్కించుకుంది. మరో ఐదేండ్ల వరకు అంటే.. 2028 వరకు టాటానే టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించనుంది. ఈమేరకు టాటా గ్రూప్ శుక్రవారం భారత క్రికెట్ బోర్డు(BCCI)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం బీసీసీఐకి కోట్లు కొద్ది రూపాయలు చెల్లించనుంది.
ఇకపై ప్రతి ఐపీఎల్ సీజన్కు టాటా కంపెనీ.. బీసీసీఐకి రూ.500 కోట్లు ముట్టజెప్పనుంది. అంతేకాదు ఇన్విటేషన్ టు టెండర్ నిబంధనల ప్రకారం టాటా గ్రూప్ భారత్కు చెందిన మరో కార్పొరేట్ కంపెనీ ఆఫర్ను అంగీరించవచ్చు. ఆదిత్యా బిర్లా గ్రూప్ రూ.2,500 కోట్ల ఆఫర్ ప్రకటించింది.
టాటా కంపెనీ తొలిసారి 2022లో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ హక్కులు దక్కించుకుంది. చైనాకు చెందిన వివో కంపెనీ టైటిల్ స్పాన్సర్గా వైదొలగడంతో టాటాకు అవకాశం వచ్చింది. దాంతో, ప్రతి సీజన్కు బీసీసీఐకి రూ.365 కోట్లు చెల్లించేందుకు టాటా అంగీకరించింది.
16వ సీజన్ ఫైనల్కు ముందు ధోనీ, హార్దిక్ పాండ్యా
ఐపీఎల్ 17వ సీజన్ మార్చి ఆఖర్లో మొదలవ్వనుంది. ఇప్పటికే వేలం ముగియడంతో అన్ని జట్లు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. కొన్ని ఫ్రాంచైజీలు అయితే కొత్త కోచ్లను నియమించుకున్నాయి. ఇప్పటివరకూ ఒక్కసారి కూడా టైటిల్ గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్లు ఈసారి విజేతగా నిలవాలనే కసితో ఉన్నాయి.