అయోధ్య: హైదరాబాదీ(Hyderabad) రామ భక్తులు అయోధ్యాధీశుడిపై తమ ప్రేమను చాటుకున్నారు. సిటీలోని శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీసెస్ ఓనర్ ఎన్ నాగభూషణం రెడ్డి తయారు చేసిన భారీ లడ్డూ(Laddoo) ఇవాళ తెల్లవారుజామున అయోధ్యకు చేరుకున్నది. సుమారు 1265 కేజీల బరువు ఉన్న ఆ లడ్డూ కరసేవక్పురంకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు. క్యాటరింగ్ వ్యాపారంపై, తన ఫ్యామిలీపై రాముడి ఆశీస్సులు ఉన్నాయని, బ్రతికి ఉన్నంత కాలం రాముడి కోసం ప్రతి రోజు ఒక కేజీ లడ్డూ తయారు చేయాలని కాంక్షించానని నాగభూషణం తెలిపారు. అయోధ్యకు తీసుకువెళ్లిన లడ్డూకు సంబంధించిన ఫుడ్ సర్టిఫికేట్ను కూడా తీసుకువచ్చినట్లు చెప్పారు. తాము తయారు చేసిన లడ్డూలు నెల రోజులు వరకు పాడవకుండా ఉంటాయన్నారు. మూడు రోజుల పాటు 25 మంది ఆ అఖండ లడ్డూను తయారు చేసినట్లు తెలిపారు.
#WATCH | Ayodhya, UP: 1265 kg laddoo prasad reaches Karsevakpuram from Hyderabad.
N Nagabhushanam Reddy of Sri Ram Catering Services, who prepared these laddoos says, “…God has blessed my business and my family. I had pledged to prepare 1kg laddoo for each day till I am… pic.twitter.com/iT1bYiETBy
— ANI (@ANI) January 20, 2024
ఈనెల 17వ తేదీన హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో బయలుదేరినట్లు ఆయన చెప్పారు. అఖండ లడ్డూను తీసుకువచ్చేందుకు వాహనంకు ప్రత్యేక సస్పెన్షన్ చేయించినట్లు తెలిపారు. గ్లాసు, ఏసీ కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు. 350 కేజీల శనగ పిండి, 700 కేజీల చక్కర, 40 కిలోల కాజూ, 25కేజీల బాదాం, 4 కిలోల కిస్మిస్, 40 కిలోల నెయ్యి, 15 కిలోల నూనె, కుంకుమ పువ్వు, పచ్చ కర్పూరంతో లడ్డూను తయారు చేసినట్లు ఆయన తెలిపారు.