లక్నో, జనవరి 19: నిల్చొని తింటున్నారా? అయితే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉన్నదని అంటున్నారు శాస్త్రవేత్తలు. నిల్చొని తినటం వల్ల పొట్ట సంబంధిత, పేగు సంబంధిత క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. లక్నోలోని కల్యాణ్సింగ్ సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు చెందిన రేడియోథెరపీ విభాగ అధిపతి రాకేశ్ కపూర్ ఆధ్వర్యంలోని బృందం నిల్చొని తినటం వల్ల కలిగే అనర్థాలపై పరిశోధనలు చేసింది.
ఈ పరిశోధనల్లో నిల్చొని తిన్నప్పుడు అన్నవాహిక సంబంధిత వ్యాధులు వస్తాయని తేలింది. నిల్చొని నీళ్లు తాగినా ఈ సమస్య వస్తుందని గుర్తించారు. నిల్చొని తిన్నా, నీళ్లు తాగినా అన్నవాహిక కండరాల పనితీరుకు అడ్డు తగిలి జీర్ణక్రియ పనితీరుపై ప్రభావం పడుతుందని పరిశోధకులు వివరించారు. ఈ పరిస్థితి రానురానూ అన్నవాహిక క్యాన్సర్కు దారితీస్తుందని వెల్లడించారు. అదేవిధంగా, జీవితంలో ఎదిగే క్రమంలో మహిళలు పెండ్లిని ఆలస్యం చేస్తున్నారని, దీని ప్రభావంతో వారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నారు.
