చెన్నై: టోక్యో ఒలింపిక్స్లో పోటీ చేసే క్రీడాకారులకు తమిళనాడు ప్రభుత్వం భారీ ఆఫర్ ప్రకటించింది. ఒలింపిక్స్లో స్వర్ణ పతకం గెలిచిన క్రీడాకారులకు మూడు కోట్ల నగదు ఇవ్వనున్నట్లు సీఎం స్టాలిన్ వెల్లడించారు. సిల్వర్ పతక విజేతకు రెండు కోట్లు, కాంస్య పతక విజేతకు కోటి ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. జూన్ 28వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా షాపింగ్ మాల్స్, వస్త్ర దుకాణాలు, జ్వలరీ షాపులను తెరవనున్నారు. లాక్డౌన్ను మాత్రం జూలై 5వ తేదీ వరకు పొడిగించారు.