న్యూఢిల్లీ: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ భారత్ నుంచి తరలిపోవడం దాదాపు ఖాయమైనట్టుగా కనిపిస్తున్నది. మెగాటోర్నీని యూఏఈలోనే నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ దిశగా బోర్డు కార్యదర్శి జై షా సంకేతాలు ఇచ్చారు. కరోనా పరిస్థితుల వల్ల యూఏఈలో ప్రపంచకప్ నిర్వహించే అవకాశం ఉందని శనివారం ఓ ఇంటర్వ్యూలో షా చెప్పారు. మరోవైపు ప్రపంచకప్ అక్టోబర్ 17న మొదలై నవంబర్ 14న ఫైనల్ జరుగుతుందని సమాచారం.