T20 World Cup | టీ20 ప్రపంచకప్లో భారత్ కథ ముగిసింది. అలాగే అంతర్జాతీయ టీ20ల్లో కెప్టెన్ కోహ్లీ పాత్ర కూడా ముగిసింది. ఈ క్రమంలో టీ20ల్లో తర్వాతి కెప్టెన్ ఎవరు? అనే అంశంపై కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. అయితే నమీబియాతో మ్యాచ్లో టాస్ సందర్భంగా కోహ్లీ, మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ రవిశాస్త్రి ఈ విషయంలో పెద్ద హింటే ఇచ్చారు.
తదుపరి కెప్టెన్ రోహిత్ శర్మ అవుతాడన్నట్లుగా వాళ్లిద్దరూ మాట్లాడారు. అయితే జట్టు దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేఎల్ రాహుల్, రిషభ్ పంత్లలో ఒకరిని సారధి చేయాలని కూడా కొందరు ఆలోచిస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి తొందరపాటు నిర్ణయం వద్దని భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ సూచించాడు.
2023 ప్రపంచకప్ కోసమైతే దీర్ఘకాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోవాలని, కానీ వచ్చే ఏడాది మరో ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో జట్టుకు కప్పు అందించగలిగే వ్యక్తిని ఎంచుకోవాలని చెప్పాడు. ఈ విషయంలో రోహిత్ శర్మ సరైన చాయిస్ అని, వచ్చే టీ20 ప్రపంచకప్లో టీమిండియా సారధ్య బాధ్యతలు అతనికే అందించాలని లిటిల్ మాస్టర్ అభిప్రాయపడ్డాడు.
టీ20 క్రికెట్లో టీమిండియా తదుపరి సారధి ఎవరనే విషయంలో బీసీసీఐ నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. ఈ టోర్నీతో కోచ్గా రవిశాస్త్రి పదవీకాలం కూడా ముగిసింది. అతని స్థానంలో రాహుల్ ద్రవిడ్ పగ్గాలు అందుకుంటున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.