టీ20 ప్రపంచకప్లో బుమ్రా ఆడకపోవడం టీమిండియాకు తీరని లోటని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. వెన్నునొప్పి కారణంగా ఈ మెగా టోర్నీకి బుమ్రా దూరమైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావించిన సచిన్.. బుమ్రా లేకపోవడం జట్టుకు పెద్ద లోటేనని, అయితే అతని స్థానాన్ని వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ చక్కగా భర్తీ చేయగలడని అభిప్రాయపడ్డాడు.
‘బుమ్రా లేని లోటును పూడ్చాలంటే బ్యాటర్లను ఎటాక్ చేయడంతోపాటు వికెట్లు తీసే స్ట్రైక్ బౌలర్ అవసరం అవుతాడు. ఆ పాత్రను షమీ సరిగ్గా నెరవేరుస్తాడని అనుకుంటున్నా’ అని సచిన్ వెల్లడించాడు. అలాగే టీ20 ప్రపంచకప్లో మైదానాన్ని బట్టి ఏ స్పిన్నర్లు ఆడాలో కెప్టెన్ ఎంచుకోవాలని సూచించాడు.